ఇటీవల హత్యకు గురైన విక్రమ్ కుటుంబానికి టీడీపీ తరుపున 2 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాస్ అన్నారు. విక్రమ్ కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. టీడీపీ క్యాడర్‌ను కాపాడుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఎవ్వరూ ధైర్యం కోల్పోవద్దని అన్నారు.

 

సీఐ దుర్గాప్రసాద్‌పై న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. సీఐపై తక్షణం చర్యలు తీసుకునే వరకు వదిలేది లేదని ఆయన స్పష్టం చేసారు. పల్నాడులో పోలీసు రాజ్యం నడుస్తోందన్న ఆయన... పోలీసులను అడ్డం పెట్టుకోని టీడీపీ కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారని  మండిపడ్డారు. వైసీపీ ఏడాది పాలనలో గురజాల నియోజకవర్గంలో 80 మందిపై దాడి చేశారని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. పల్నాడులో మాఫీయా రాజ్యమేలుతోందని ఆయన విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: