గుంటూరు జిల్లాలో నరసారావు పేట పార్లమెంట్ పరిధిలో మరోసారి వైసీపీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే గా రాజకీయం మారిపోయింది. ఎంపీ లావు కృష్ణదేవరాయలు చిరుమామిళ్ళలోని ఒక  వైసీపీ నేత ఇంటికి పరామర్శకు వెళ్ళగా అక్కడికి వచ్చి ఎమ్మెల్యే రజనీ వర్గీయులు ఆయనను అడ్డుకున్నారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా వస్తారు అని ఎంపీని స్థానిక నేత కోటిరెడ్డి  నిలదీశారు. 

 

తాను పరామర్శకు వచ్చాను అని అధికారిక కార్యక్రమాలకు కాదు అని ఆయన వివరించారు. అయినా సరే కోటిరెడ్డి మాత్రం వినలేదు. అనధికారిక కార్యక్రమాలకు అడ్డు పడటం ఎంత వరకు భావ్యం అని కోటిరెడ్డిని నిలదీశారు.  గొడవ పెద్దది అయ్యే అవకాశం ఉన్న నేపధ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని ఎంపీని పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: