ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నెల 19 మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అదే విధంగా మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు ఎన్నికైన నేపధ్యంలో... వారి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. నేడు ఆ ఇద్దరు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసారు. ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి కాసేపటి క్రితం నోటిఫికేషన్ విడుదల చేసారు. 

 

ఎమ్మెల్యే కోటాలో అవి ఖాళీ అయ్యాయి అని ఆయన పేర్కొన్నారు. దీనితో ఇప్పుడు అధికార విపక్షాల నుంచి ఎవరు పోటీ చేస్తారు అసలు ఎప్పుడు ఎన్నిక నిర్వహిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీ నుంచి విజయవాడ యువనేత దేవినేని అవినాష్ ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: