హైదరాబాద్ సిటీ పోలీస్ లో క్లూస్ టీం స్పెషల్ వింగ్ పై సీపీ అంజనీ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. క్లూస్ టీం కు దేశంలోనే మంచి పేరు ఉంది అని ఆయన వివరించారు. హైదరాబాద్ నగరంలోని 17 డివిజన్లలను క్లూస్ టీమ్ 24 గంటలు వాచ్ చేస్తుందని ఆయన వివరించారు. సాంకేతికతను ఉపయోగించి కేసులను ఛేదించడం అనేది చాలా ముఖ్యమని ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో నేరస్తులు కూడా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని ఆయన చెప్పారు. కోట్లు విలువ చేసే పరికరాలను క్లూస్ టీమ్ కి అందజేసామని ఆయన ఈ సందర్భంగా వివరించారు. గత ఏడాది సంచలనం సృష్టించిన దిశ కేసు తో పాటుగా ఈ ఏడాది వరంగల్ లో 10 మంది మర్డర్ కేసులో క్లూస్ టీమ్ చాలా ఆధారాలు సేకరించింది అని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరిలో కరీంనగర్ లో జరిగిన మర్డర్ కేసును క్లూస్ టీమ్ ఛేదించిందని చెప్పారు.