భారత్ చైనా సరిహద్దుల్లో వాతావరణం కాస్త... ఆందోళనకర వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. పరిస్థితి ఇప్పుడు కాస్త వేడెక్కే సూచనలు ఉన్న నేపధ్యంలో కేంద్ర  ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తూ వస్తుంది. భారీగా ఆర్మీ ని మొహరిస్తుంది సరిహద్దుల్లో. చైనా ఆర్మీ 20 వేల మంది సైనికులను సరిహద్దుల్లో మోహరించిన సంగతి తెలిసిందే.

 

ఇక భారత్ కూడా అదే స్థాయిలో సరిహద్దుల్లో భారీగా మొహరించాలి అని నిర్ణయానికి వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఎల్లుండి భారత రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ సింగ్ లడఖ్ పర్యటనకు వెళ్తున్నారు. లడఖ్ లో ఆయన ఆర్మీ అధికారులతో సమావేశం కానున్నారు. వారి నుంచి ఆయన పరిస్థితిని ఆరా తీయనున్నారు. ఆయన పర్యటన తర్వాత భారత్ ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: