తమిళనాడులో కరోనా కేసులు ఏ మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి  చెన్నై సహా పలు  జిల్లాల్లో కరోనా కేసులు ఏ మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ ని అమలు చేస్తున్నా సరే ఫలితం మాత్రం ఉండటం లేదు. తమిళనాడులో తాజాగా మరోసారి భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో తమిళనాడులో 3,882 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 

 

2,852 మంది గత 24 గంటల్లో కోలుకున్నారు. ఇక ఇదిలా ఉంటే గత 24 గంటల్లో 63 మరణాలు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 39,856 క్రియాశీల కేసులు ఉన్నాయి రాష్ట్రంలో. 52,926 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసులు 94 వేలు దాటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: