మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన బిజెపి సర్కార్... రేపు మంత్రి వర్గ విస్తరణ చేయనుంది. ఈ మంత్రి వర్గ విస్తరణపై ఇప్పుడు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఆ రాష్ట్ర సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ... గురువారం మంత్రి వర్గ విస్తరణ చేస్తామని అన్నారు.
ఉత్తరప్రదేశ్ గవర్నర్... ఆనంది బెన్ పటేల్ నేడు మధ్యప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేస్తారు అని ఆయన వివరించారు. అనంతరం రేపు కేబినేట్ విస్తరణ ఉంటుంది అని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్ గవర్నర్ కరోనాతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీనితో ఆనందిబెన్ పటేల్కు మధ్యప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఎవరికి మంత్రి పదవి వస్తుందా అనే చర్చ జరుగుతుంది.