కేరళలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి. అక్కడ వంద వరకు గత రెండు రోజుల నుంచి నమోదు అవుతున్న కరోనా కేసులు నేడు మరోసారి భారీగా నమోదు అయ్యాయి అని అక్కడి ప్రభుత్వం హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. కేరళలో ఈ రోజు 151 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 

 

గత 24 గంటల్లో భారీగా కరోనా రోగులు కోలుకున్నారు అని ప్రభుత్వం వెల్లడించింది. 131 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2130 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 4593కి చేరుకున్నాయి. రాష్ట్రంలో 124 కోవిడ్ -19 హాట్‌స్పాట్‌లు ఉన్నాయని సిఎం పినరయి విజయన్ కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: