అక్టోబర్ 4న జరిగే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలు మార్చుకునేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్​సీ) అవకాశం కల్పించింది. కరోనా కారణంగా తమ పరీక్ష కేంద్రాలు మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించాలంటూ.. పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చిన నేపథ్యంలో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

 

 

అలాగే సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్‌తో పాటు ఐఎఫ్​ఎస్​ మెయిన్స్ పరీక్షల కేంద్రాలూ మార్చుకునేందుకూ అవకాశం ఉంటుందని తెలిపింది యూపీఎస్​సీ.సదరు పరీక్షా కేంద్రాల్లో అవకాశాలను బట్టి.. ఆ కేంద్రాన్ని కేటాయిస్తామని కమిషన్ వివరించింది. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికే తొలి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసింది. ఒకవేళ వారు కోరుకున్న కేంద్రం కేటాయించేందుకు సీలింగ్ కారణంగా కుదరకుంటే మరో పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవచ్చని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: