బ్రెజిల్​లో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 9మంది మరణించారు. మరో ఇద్దరు గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడం వల్ల విద్యుత్​ సరఫరా నిలిచిపోయి వేలాది మంది అంధకారంలో ఉన్నారు.

 

 

బ్రెజిల్​ ఇప్పటికే కరోనాతో అతలాకుతలం అవుతోంది. కొవిడ్​-19 కేసుల్లో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ఇప్పుడు ఆ దేశాన్ని మరో ప్రకృతి విపత్తు తాకింది. భారీ తుపాను కారణంగా దక్షిణ బ్రెజిల్​లో వరదలు సంభవించాయి. శాంటా కాటారినా రాష్ట్రంలో ఇప్పటివరకు 9 మంది మృతి చెందగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.

 

 

మరో రాష్ట్రం రియో గ్రాండే డూ సోల్​లో 1100మంది నిరాశ్రయులయ్యారు. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలుల వల్ల చెట్లు, విద్యుత్​ స్తంభాలు నేల కూలాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి వేలాది మంది అంధకారంలోకి వెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: