నేటి నుంచి రాష్ట్రంలో రాత్రి 9.30 వరకు మద్యం విక్రయాలు జరుగుతాయని అబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 93 ప్రకారం నూతన మార్గదర్శకాలు అమలులో ఉంటాయని వివరించారు. లాక్‌డౌన్ సమయంలో అక్కడక్కడా అక్రమ మద్యం, గుడుంబా తయారీ మొదలైందని... వారిపై కేసులు నమోదు చేసి నిర్మూలన చేశామన్నారు.

 

 

అక్రమ మద్యం వివరాలు తెలిస్తే ప్రజలు వెంటనే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వారి వివరాలు గోప్యంగా ఉంచి, తగిన పారితోషకం ఇస్తామని మంత్రి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: