ఆంధ్రప్రదేశ్ లో 108 వాహనాలు ప్రారంభించడం అనేది నిజంగా ఒక సంచలనం అనే చెప్పాలి. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే సిఎం జగన్ మాత్రం పేదల ఆరోగ్యం దృష్టి లో   పెట్టుకుని ముందుకి అడుగులు వేసారు. ఈ కార్యక్రమం నిన్న విజయవాడ కేంద్రం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది అనే చెప్పాలి. దీనిపై సర్వత్రా ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. 

 

తాజాగా దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి  ట్వీట్ చేసారు. నాన్న ఒక్క అడుగు వేస్తే నేను రెండు అడుగులు మీకోసం వేస్తా అని చెప్పటమే కాదు, ఆ మహానేత తలపెట్టిన బృహత్తర కార్యక్రమాన్ని ఇంకొక అడుగు ముందుకి తీసుకుని వెళుతూ అత్యాధునిక సదుపాయాలతో 108 & 104 వాహనాలను ప్రారంభించిన మన యువ ముఖ్యమంత్రి జగన్ గారు. అంటూ ఆయన ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: