దేశంలో ఏమంట కరోనా వచ్చిందో కానీ.. మనుషుల మద్య దూరాలు బాగా పెరిగిపోతున్నాయి. భౌతిక దూరం పాటించడమే కాదు.. మనిషిపై మనిషి అసహనం పెంచుకుంటున్నారు. చిన్న చిన్న గొడవలకు పెద్ద మూల్యం చెల్లించే పరిస్థితి ఏర్పడుతుంది. స్నేహితుల మద్య వచ్చిన గొడవల్లో ఏకంగా చంపుకునే స్థాయికి చేరుతుంది. తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై కొందరు దుండగులు బీరు సీసాతో విచక్షణ రహితంగా దాడి చేశారు. లయోలా కళాశాల సమీపంలో గుర్తుతెలియని దుండగులు దాడి చేయడం కలకలం రేపింది.
సూర్యనగర్కు చెందిన శ్రీకాంత్.. కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతను పని ముగించుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడి ఎవరు.. ఎందుకు చేశారు అన్న విషయం పక్కన బెడితే... అక్కడ జరిగిన సంఘటనకు చుట్టుపక్కల ప్రాంతాల వారు భీతిల్లిపోయారు. ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయాలతో ఉన్న శ్రీకాంత్ను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.