వాలంటీర్లను గుప్పిట్లోకి తెచ్చుకున్నంత మాత్రాన ఓటరు మనసును ఎవరూ మార్చలేరని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం క్లౌడ్ 9 లో ఉందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రం వాళ్ల సొంత జాగీరుదారు అనుకుంటోందని ఆమె మండిపడ్డారు. 

 

రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మొత్తాన్ని ప్రభుత్వం గుప్పిట్లోకి తీసుకోవాలని ఆమె మండిపడ్డారు. పీకేకు అప్పగించేందుకు చూస్తోందని ఆమె ఆరోపించారు.  ఆనాడు చంద్రబాబు నాయుడును ఎవరూ వ్యతిరేకించలేదని ఆమె పేర్కొన్నారు. ఒక్క చాన్స్ ఇచ్చి చూద్దామని చెప్పి జగన్‌కు ప్రజలు అవకాశం ఇచ్చారని ఆమె అన్నారు. ఇంతవరకు ప్రజలు ఎవరూ చంద్రబాబుపై వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆమె చెప్పుకొచ్చారు. చంద్రబాబు కరోనాపై చేసిన సూచనలను ప్రధాని నరేంద్ర మోడీ పాటించారు అని ఆమె ఈ సందర్భంగా  వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: