ఆంధ్రప్రదేశ్ లో సామాజిక న్యాయం అంటూ పదే పదే చెప్పే సిఎం జగన్ వైసీపీలో సామాజిక న్యాయం లేదని తెలియదా? అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. మూడు ప్రాంతాల్లో విజయసాయిరెడ్డి, ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు అప్పగించారు అని ఆయన ఆరోపించారు. మీ పార్టీలో వేరే కులాల వారు లేరా? అని ఆయన నిలదీశారు.

 

వారు పదవులకు పనికి రారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల పాలక మండళ్లలో అంతా మీ బంధువులే ఉన్నారని ఆయన మండిపడ్డారు. 70 మందిలో 46 మంది మీ కులం వారే ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. సెర్చ్ కమిటీల్లో 12 మందికి 9 మంది రెడ్లకే ఇచ్చారని అన్నారు. ముగ్గురు, నలుగురే మొత్తం నడిపిస్తున్నారు. ఎస్సీ నాయకులు పదవులకు పనికిరారా? అని నిలదీశారు. డిప్యూటి సిఎంలు అసలు సిఎంలతో మాట్లాడే పరిస్థితి లేదని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: