ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణా రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ లో  కరోనా కేసులు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా హైదరాబాద్ లో చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం ఆగడం లేదు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తాజాగా... హైదరాబాద్ పై కేంద్రం దృష్టి పెట్టింది అనే వార్తలు వస్తున్నాయి. 

 

హైదరాబాద్ లో కరోనా పరిక్షలు తక్కువగా జరుగుతున్నాయి అనే ఆరోపణల నేపధ్యంలో ఇప్పుడు కేంద్రం అక్కడ పరీక్షలను చేయడానికి రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. పరిక్షల కోసం కేంద్ర బృందాలను హైదరాబాద్ పంపించే అవకాశం ఉంది అని ప్రచార౦ జరుగుతుంది. ముఖ్యంగా కేసులు పెరిగే ప్రాంతాల్లో  ప్రతీ ఇంటికి కరోనా పరిక్షలు చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: