108, 104 అంబులెన్స్‌లో 300 కోట్లు కొట్టేసిన వాళ్ళు ప్రారంభోత్సవాలు, పుట్టిన రోజులు జరుపుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రివర్స్ పాలన మహిమతో రాష్ట్రంలో నేరస్తులు రోడ్డుపై తిరుగుతున్నారని ఆయన అన్నారు. నిరపరాధులు జైల్లో ఉంటున్నారని ఎద్దేవా చేసారు. 

 

అచ్చెన్న ఆరోగ్యంగా ఉండుంటే, వీల్ చైర్‌లో తీసుకేళ్లే అవసరం అవసరం ఏముందని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికే ప్రభుత్వ నిర్వాకంతో రెండు సార్లు ఆపరేషన్ చేశారని ఆయన ఆరోపించారు. అచ్చెన్నను ఒక్క రోజైనా జైల్లో ఉంచాలనేది జగన్ పైశాచిక ఆనందం కోసమే అని ఆయన ఆరోపించారు. బీసీలంటే జగన్‌కు చులకన, కక్షసాధింపు అని  ఆయన మండిపడ్డారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్ అందరిని జైలుకు పంపించాలని అవినీతి బురద అంటిస్తున్నారని తీవ్ర విమర్శలు చేసారు ఆయన

మరింత సమాచారం తెలుసుకోండి: