తెలుగుదేశం హయాంలో సామాజిక న్యాయం జరిగిందా.. ఇప్పుడు జరుగుతోందా? అనే దానిపై సవాల్ విసురుతున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. సామాజిక న్యాయానికి తాను కట్టుబడి ఉన్నాను అని ఆయన స్పష్టం చేసారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు ఏపీ రాష్ట్రాన్ని పంచేశారని ఆయన మండిపడ్డారు.
టీడీపీ నేత శిద్దా రాఘవరావు వ్యాపారాలకు రూ. 800 కోట్లు జరిమానా వేసి సరెండర్ చేసుకున్నారని ఆయన మండిపడ్డారు. పోలవరంలో, పట్టిసీమలో అవినితి అని ప్రచారం చేశారన్న ఆయన.. ఇప్పుడు అవీనితి లేదని కేంద్రమే తెల్చిచెప్పిందని ఆయన గుర్తు చేసారు. దీనికి ఏమి సమాధానం చెబుతారని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.