ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాసి సంచలనం సృష్టించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం పొడిగించడంపై ఆయన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. 

 

ఈ మేరకు ఆయన మోడీకి ఒక లేఖ రాశారు. దూరదృష్టితో తీసుకున్న పరిపాలనా నిర్ణయంతో 80 కోట్ల మంది పేదలకు మేలు చేస్తుందని ఆయన ఈ సందర్భంగా తన లేఖలో వ్యాఖ్యానించారు.  ప్రధాని మోదీని దయ గల మనిషిగా చరిత్ర గుర్తిస్తుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కాగా ఆయనపై లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేయడానికి గానూ వైసీపీ ఎంపీలు ఢిల్లీ రేపు వెళ్లనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: