టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుని ఈఎస్ఐ కుంభకోణం లో అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. అచ్చెన్నాయుడుని కలిసేందుకు సబ్ జైలు వద్దకు వచ్చామన్న ఆయన అనుమతి లేదని చెప్పి‌ అడ్డుకున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. 

 

హైకోర్టు ఆదేశాల వల్ల అనుమతి ఇవ్వడం లేదని సూపరింటెండెంట్ చెప్పారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారు అని మండిపడ్డారు. ప్రొటోకాల్ పాటించకుండా సామాన్య ఖైదీలాగా ట్రీట్ చేస్తున్నట్లు తమకు తెలిసిందని ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతల అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారన్నారు అని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: