భారత్ చైనా వ్యవహారంలో ఇప్పుడు చైనాకు మిత్ర దేశాలు కూడా దూరం  అయ్యే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. రష్యా సహా కొన్ని దేశాలు ఇప్పుడు భారత్ కి అండగా నిలుస్తున్నాయి. అదే విధంగా ఐరోపా దేశాలు కూడా  ఇప్పుడు భారత్ కి అండగా ఉంటున్నాయి. ఆస్ట్రేలియా సహా కొన్ని దేశాలు ఇప్పుడు చైనా విషయంలో చాలా ఆగ్రహంగా ఉన్నాయి. 

 

కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణం అని కరోనా వైరస్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను అడ్డ౦ పెట్టుకుని చైనా డ్రామాలు ఆడింది అని పలు దేశాల అధినేతలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సరిహద్దుల్లో భారత్ ని ఇబ్బంది పెడుతున్న నేపధ్యంలో భారత్ మిత్ర దేశాలు అన్నీ కూడా ఇప్పుడు చైనాకు వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: