ప్రఖ్యాత చారిత్రక కట్టడాలను జులై 6 నుంచి సందర్శించేందుకు అనుమతినిస్తున్నట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ వెల్లడించారు. తగిన జాగ్రత్తలు తీసుకొని పర్యాటకులు వీటిని తిలకించవచ్చని తెలిపారు.

 

 

కరోనా వైరస్‌ నేపథ్యంలో 3,400కు పైగా సందర్శనీయ ప్రాంతాలను భారత పురావస్తు పరిశోధన సంస్థ (ఏఎస్‌ఐ) మార్చి 17న మూసేసింది. లాక్‌డౌన్‌ అమలు చేయడంతో దాదాపు జూన్‌ మధ్య వరకు అన్నీ మూసేశారు. అన్‌లాక్‌ 1 దశ మొదలైనప్పుడు దాదాపు 820 ఆధ్యాత్మిక ప్రాంతాలను పునః ప్రారంభించారు. మిగిలిన సందర్శనీయ కేంద్రాలను తెరిచేందుకు కేంద్రం తాజాగా అనుమతి ఇచ్చింది. ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్‌ తీవ్రతను బట్టి తెరవాలో, మూసేయాలో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: