ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో... 8 మంది పోలీసులు మరణించడం ఇప్పుడు సంచలనంగా మారింది. దొంగలను, రౌడీ మూకలను పట్టుకోవడానికి కాన్పూర్ పోలీసులు వెళ్ళగా వారిని గమనించి వాళ్ళు కాల్పులు జరపడంతో అక్కడిక్కడే 8 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇదిలా ఉంటే... ఈ కాల్పుల ఘటనపై ఉత్తరప్రదేశ్ డీజీపీ మాట్లాడుతూ...
కాన్పూర్లో నేడు నేరస్థుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మంది పోలీసులు వివరాలు... సిఐ దేవేంద్ర కుమార్ మిశ్రా, ఎస్ ఓ మహేష్ యాదవ్, చౌకి ఇన్ఛార్జ్ అనుప్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ నెబ్యులాల్, కానిస్టేబుల్స్ సుల్తాన్ సింగ్, రాహుల్, జితేంద్ర, బాబ్లూ అని డీజీపీ వెల్లడించారు. ఇప్పుడు ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.