ఒడిశా రాష్ట్రంలో వింత సంఘటన జరిగింది. సాధారణంగా మొసలిని చూస్తే  చాలా మందికి భయంగా ఉంటుంది. కాని ఆ రాష్ట్రంలో మాత్రం కొందరు దాన్ని చెరువులో చూసి పట్టుకుని వచ్చి చంపి తినేశారు. ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లాలో పొడియా బ్లాకులోని కలదపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. 

 

గ్రామం మీదుగా సబేరీ నది వెళ్తుంది. అందులో మొసలి ఉంది అని గమనించిన గ్రామస్తులు... ఓ మొసలిని పట్టుకున్నారు. ఆ తర్వాత దాన్ని చంపి మాంసం అందరూ సమానంగా పంచుకుని వండుకుని తిన్నారు. దీనిపై అధికారులకు సమాచారం అందడంతో వారు రంగంలోకి దిగి  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరా తీసింది. ప్రత్యేక కమిటీని నియమించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: