ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం ఆగడం లేదు. కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్యలు చేపడుతున్నా సరే కేసులు మాత్రం  ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే... తిరుమల శ్రీవారి దర్శనం నిలిపివేస్తారు అని వార్తలు వచ్చిన నేపధ్యంలో కలెక్టర్ భరత్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

అసలు శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించటానికి, తిరుపతిలో వైరస్ వ్యాప్తికి సంబంధం లేదని ఆయన స్పష్టం చేసారు. అలిపిరి వద్ద 20 రోజులుగా భక్తుల నుంచి సేకరిస్తున్న ర్యాండమ్ శాంపిల్స్‌లో ఒక్కరికి కూడా పాజిటివ్‌ రాలేదని ఆయన పేర్కొన్నారు. టీటీడీలో పనిచేసే 8 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: