దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత ఏ మాత్రం ఆగడం లేదు. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో... 21 వేల కేసులు దాదాపుగా నమోదు అయ్యాయి అంటే ఏ స్థాయిలో కరోనా తీవ్రత ఉందో అర్ధం చేసుకోవచ్చు. గత 24 గంటల్లో 379 మరణాలు నమోదు అయ్యాయి.

 

అత్యధికంగా ఒక్క రోజే 20,903 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు కేసులు 6,25,544 కి చేరుకున్నాయి. వీటిలో 2,27,439 క్రియాశీల కేసులు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. 3,79,892 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 18213 మంది దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా మరణించారు అని  ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: