గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం సంచలనంగా మారింది. అయన చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఈ మధ్య కాస్త సంచలనంగా మారాయి. తాజాగా ఆయనపై అనర్హత వేటు వెయ్యాలి అని ఎంపీలు అందరూ కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్ళారు. 

 

ఈ తరుణంలో ఆయన హైకోర్ట్ లో ఒక పిటీషన్ దాఖలు చేసారు. తనపై అనర్హత, సస్పెన్షన్ చర్యలను అడ్డుకోవాలని ఆయన హైకోర్టును కోరారు. తనకు వేరే పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసులు ఇచ్చారని, తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యానని, కాని తనకు మాత్రం వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసు ఇచ్చారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: