ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి కరోనా కేసుల పెరగడమే గాని తగ్గే పరిస్థితి కనపడట౦ లేదు. గత 24 గంటల్లో ఏపీలో 837 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అదే విధంగా 9 మంది కరోనా కారణంగా మరణించారు అని ఏపీ సర్కార్ వెల్లడించింది. 

 

మొత్తం కేసుల సంఖ్య 16 వేల 934 కి చేరుకుంది. ఏపీ కి చెందిన వారికి 789 మందికి కరోనా సోకింది. కరోనా నుంచి ఇప్పటి వరకు 7632 మంది కోలుకుని బయటపడ్డారు. ఇక 206 మంది కరోనాతో మరణించారు. 9096 యాక్టివ్ కేసులు ఉన్నాయి రాష్ట్రంలో. కరోనా అత్యధిక కేసులు కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనే నమోదు అవుతున్నాయి. ఇక పరిక్షలు కూడా వేగంగా చేస్తుంది సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి: