రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా కేసులు ఎంత‌లా స్వైర‌విహారం చేస్తున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తెలంగాణ‌లోనే కాదు ఏపీలో రోజు రోజుకు క‌రోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో ఏకంగా 38 వేల ప‌రీక్ష‌లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో  9 ల‌క్ష‌ల ప‌రీక్ష‌లు చేశారు.

 

ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాలో ఒకే ఇంట్లో ఆరుగురికి క‌రోనా పాజిటివ్ రావ‌డం తీవ్ర క‌ల‌కలం రేపింది. గుంటూరు జిల్లా రెంటచింతల గ్రామంలో కరోనా కలకలం రేపింది. ఈ గ్రామంలో ఒకే కుటుంబంలో ఆరుగురు  కరోనా నిర్ధారణ కావ‌డంతో ఆరుగురిని కోరంటైన్ రెడ్ జోన్ లో ఉంచారు. దీంతో రెంటచింతల గ్రామంలో ప్ర‌తి ఒక్క‌రు ఆందోళ‌న‌కు గుర‌వుతుండ‌గా.... భయం గుప్పిట్లో రెండుచింతల గ్రామవాసులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: