తమ పార్టీ లోక్సభ ఎంపీ రఘురామ కృష్ణం రాజుపై అనర్హత వేటు వెయ్యాలని తాము లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరామని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. రఘుపై చర్యలు తీసుకుంటామని... స్పీకర్ హామీ ఇచ్చారని ఆయన అన్నారు. రఘు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు అని ఆయన పేర్కొన్నారు. 

 

వైసీపీలోనే ఉంటూనే ప్రతిపక్షాలతో మంతనాలు జరుపుతూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు అని అయన ఆరోపించారు. రఘు నైతిక విలువలు కోల్పోయారు అని మండిపడ్డారు. రఘు సొంత పార్టీ  ఎమ్మెల్యేలానే తిడుతూ దిగజారుడు రాజకీయాలు చేసారు అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఆయన పార్టీలో ఉండటానికి అనర్హుడు అంటూ విజయసాయి రెడ్డి స్పష్టం చేసారు. ఆయన ప్రతిపక్షాలతో రాజీ పడ్డారు అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: