వైసీపీ లోక్సభ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మనసా వాచా పార్టీలో లేరు అని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపణలు చేసారు. రఘురామ కృష్ణం రాజు ఏదో లాభాలు ఆశించి పార్టీ మీద విమర్శలు చేసారు అని మండిపడ్డారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు అని విజయసాయి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.
ఏదైనా అనుమానాలు ఉన్న సమయంలో సిఎం జగన్ దృష్టికి చెప్పాలని అన్నారు. స్వపక్షం లోనే ఆయన విపక్షం మాదిరిగా వ్యవహరించారు అని మండిపడ్డారు. ఏ పార్టీ తరుపున ఎంపీ గా ఎన్నికయ్యరో ఆ పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు అని మండిపడ్డారు. ఆయన ఇతర పార్టీలకు బాగా దగ్గరయ్యారు అంటూ విజయసాయి రెడ్డి మండిపడ్డారు.