భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నేపధ్యంలో అనూహ్యంగా లడఖ్ పర్యటనకు వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోడీ  ప్రపంచాని ఆశ్చర్యానికి గురి చేసారు. ఆయన పర్యటన చూసి ప్రపంచ దేశాలతో పాటుగా విపక్ష కాంగ్రెస్ కూడా షాక్ అయింది. ఆయన ఎందుకు వెళ్లి ఉంటారు అంటూ అంతర్జాతీయ మీడియా  కూడా ఆరా తీసింది. 

 

ఇక ఆయన పర్యటనపై కాంగ్రెస్ స్పందించింది. లడఖ్‌లో ప్రధాని మోదీ పర్యటనపై లోకసభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ... మోదీ పర్యటన కచ్చితంగా జవాన్లకు మంచి ప్రేరణను కల్పిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్రిక్తత జరిగిన ప్రాంతాలను ఆయన ఇంతకు ముందే సందర్శించి ఉండాల్సిందని ఆయన పేర్కొన్నారు. దేశ భూభాగంలో చైనా చొరబాటుదారులు ఎక్కడ ఉన్నా వారిని వెంటనే తరిమి కొట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: