వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్యకు సంబంధించి మాజీ మంత్రి టీడీపీ నేత కొల్లు రవీంద్ర పై  పోలీసులు హత్య కేసు నమోదు చేయడాన్ని ఇప్పుడు తీవ్రంగా తప్పుబడుతుంది తెలుగుదేశం పార్టీ. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్వీట్ చేసారు. “మచ్చ లేని నాయకుడు కొల్లు రవీంద్ర అని ఆయన ట్వీట్ చేసారు. ఆయనపై హత్య కేసు పెట్టాలని అనుకోవడం వైఎస్ జగన్ గారి అధికార మదానికి నిదర్శనం. బీసీలంటే జగన్ గారు మండిపడుతున్నారు. బీసీలకు ఉన్న రిజర్వేషన్లు కట్ చేసారు. బీసీల నిధులు పక్క దారి పట్టించారు. అని ఆయన మండిపడ్డారు. 

 

బలమైన బీసీ నాయకత్వం లేకుండా చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకొని జగన్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు.నా పై హత్యాయత్నం చేసారు.పెళ్లికి వెళ్లారని యనమల గారిపై అట్రాసిటీ కేసు పెట్టారు. అయ్యన్న గారి పై నిర్బయ కేసు,అచ్చెన్న గారి పై అక్రమ కేసు.కేసులతో బీసీ నాయకత్వాన్ని అణిచివేయాలనుకుంటున్న జగన్ రెడ్డి గారికి బీసీలు బుద్ది చెప్పడం ఖాయం” అని ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: