కరోనా వైరస్ నుంచి ప్రపంచం బయటపడాలి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాస్క్ మినహా మరో మార్గం లేదు. మాస్క్ లేదా వ్యాక్సిన్ ఈ రెండే ఇప్పుడు మనల్ని దాని బారి నుంచి కాపాడే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు దేశాధినేతల నుంచి గ్రామ సర్పంచ్ ల వరకు కూడా మాస్క్ అవసరం గురించి పదే పదే చెప్తూ వస్తున్నారు. 

 

అయితే తాజాగా ఒక వ్యక్తి ఏకంగా తన కోసం బంగారు మాస్క్ చేయించుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి ఈ మాస్క్ ని తయారు చేయించాడు. పూణే జిల్లా పింప్రి- చిన్చ్వాడ్ నివాసి అయిన శంకర్ కురాడే తన కోసం రూ .2.89 లక్షల విలువైన బంగారంతో మాస్క్ తయారు చేయించుకున్నాడు. దీని వలన శ్వాస సంబంధిత సమస్యలు రావడం లేదు అని అతను చెప్పడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: