ముందు నుంచి ప్రకాశం జిల్లాను కరోనా వైరస్ భయపెడుతూనే ఉంది. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే జిల్లాలో కరోనా మాత్రం ఆగడం లేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు వెయ్యికి దగ్గరలో ఉన్నాయి. జిల్లాలో తాజాగా మరో 79 మందికి కరోనా సోకింది అని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

 

దీనితో మొత్తం కరోనా కేసుల సంఖ్య 979కి చేరింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 14  మంది కరోనాతో మరణించారు. 85,561 మందికి జిల్లాలో కరోనా పరిక్షలు నిర్వహించారు అధికారులు. కరోనా నుంచి 347 మంది కోలుకుని బయటపడ్డారు. 532 మందికి చికిత్స అందుతుంది. క్వారంటైన్ లో దాదాపు 500 మంది వరకు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: