వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో కలిసి తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కి ఆమె ధన్యవాదాలు చెప్పారు. త్వరలోనే తెలుగు అకాడమి కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. 

 

తాత్కాలికంగా టీటీడీ భవనంలో తెలుగు అకాడమి కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆమె... తెలుగు ప్రాచీన గ్రంథాలు, పుస్తకాలు, సంస్కృతి తాళపత్ర గ్రంథాలను ఈ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో తెస్తామని ఆమె పేర్కొన్నారు. తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి సిఎం జగన్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆమె అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగింది అని ఆమె పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: