రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా ఆగడం లేదు. ఇక తెలుగు సినిమాను కూడా కరోనా కేసులు తాకాయి. తాజాగా ఒక నిర్మాత కరోనా వైరస్ కారణంగా మరణించారు. పోకూరి  రామారావు అనే నిర్మాత కరోనా కారణంగా కన్నుమూసారు. 

 

ఆయన నిన్న సాయంత్రం కరోనా తో కారణంగా మరణించారు అని  ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయన పోకూరి బాబురావు సోదరుడు. ఈతరం ఫిలింస్ లో ఆయన ఎన్నో సినిమాలను నిర్మించారు. ఇక ఆయన కరోనా కారణంగా మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ చేసారు. ఆయనకు ఇటీవల కరోనా లక్షణాలు ఉండటంతో పరిక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: