అమరావతి శాస్వతంగా ఉంటుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన అమరావతి ప్రాంత రైతులను ఉద్దేశించి కాసేపటి క్రితం మాట్లాడారు. రాజధాని ఏ ఒక్కరి కోసమో కాదని అన్నారు. 13 జిల్లాల నడిబొడ్డున రాజధాని నిర్మించాలని అనుకున్నామని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భూములు ఇచ్చారని అన్నారు. 

 

ఎపీకి ఆధునికమైన రాజధాని కావాలని అన్నారు. అమరావతిని ఎవరూ ఏమీ చేయలేరు అని ఆయన స్పష్టం చేసారు. రైతులు స్వచ్చందంగా భూములు ఇచ్చారని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే వారు భూములు ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. దేశం మొత్తం అమరావతికి అండగా నిలుస్తుందని అన్నారు. అమరావతి కోసం 66 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అని ఆయన గుర్తు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: