ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉంటుంది అని బిజెపి నేత సుజనా చౌదరి అన్నారు. ఆయన ఈ మేరకు ఒక ట్వీట్ చేసారు. రాజధాని అసలు కదిలే అవకాశం లేదు అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు. 200 రోజులుగా మొక్కవోని దీక్షతో ఉద్యమం చేస్తున్న అమరావతి ప్రజా రాజధాని ప్రజలందరికీ మేమంతా మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నాము అని ఆయన పేర్కొన్నారు. 

 

మీరు ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. “ధైర్యంగా వుండండి. మీకు న్యాయం చేసేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను. నేను గతంలో చెప్పాను. మళ్లీ చెబుతున్నా. అమరావతి నుంచి రాజధాని అంగుళం కూడా కదలదు. రాజధాని అమరావతిలోనే ఉండాలని బిజెపి తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కేంద్రప్రభుత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది.” అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: