కృష్ణా జిల్లాలో మద్యం అక్రమ రవాణా విషయంలో ఎన్ని విధాలుగా కఠిన చర్యలు తీసుకున్నా సరే తెలంగాణా సరిహద్దుల నుంచి కర్ణాటక సరిహద్దుల నుంచి మద్యం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. కృష్ణా జిల్లా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూనే ఉన్నా సరే అక్రమ వ్యాపారులు మాత్రం ఆగడం లేదు. 

 

తాజాగా మరోసారి భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా కొండపల్లి లో భారీగా మద్యం పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమంగా తరలిస్తున్న సమయంలో పట్టుకున్నారు. నాలుగు ద్విచక్ర వాహనాలు వియోగించి మూటలలో తరలిస్తున్న అక్రమార్కులను గుర్తించారు. చాక చక్యంగా వ్యవహరించిఈ అక్రమ రవాణాను అడ్డుకున్నారు ఇబ్రహీంపట్నం పోలీసులు... మొత్తం 1870 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: