టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా కంటే భయంకరం అని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ అన్నారు. విశాఖ రాజధాని చేసి ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలని ముందుకు వస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేసారు. అమరావతి రాజధాని కోసం ప్రపంచ వ్యాప్తంగా 200 నగరాల్లో కాదు కదా అమరావతిలోనే 200 గడపల్లో కూడా జరగడం లేదని ఆయన ఎద్దేవా చేసారు. 

 

ఇది ఒక క్యాపిటలిస్టు ఉద్యమమని ఆయన ఆరోపణలు చేసారు. ఉత్తరాంధ్ర టిడిపి నేతలు శిఖండి పాత్ర పోషించి మోసం చేయొద్దని ఆయన హితవు పలికారు. ఇరవై మూడు గ్రామాలకు చెందిన ఒక జాతి సమస్యను అంతర్జాతీయ సమస్యగా చూపిస్తున్నారని ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు ఆయన. చంద్రబాబు స్టేట్ కోసం కాకుండా రియల్ ఎస్టేట్ కోసం ఆలోచిస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: