వైసీపీ నేత మోకా భాస్కరరావు, అతని హత్య కేసు నిందితుడు నాంచారయ్య మధ్య గత 7, 8 సంవత్సరాల నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతుందని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు పేర్కొన్నారు. 2013 నుంచే భాస్కరరావును చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆయన వివరించారు. భాస్కర రావు ని చాలా సార్లు చంపడానికి ప్రయత్నించినా సక్సెస్ కాలేదని ఆయన వివరించారు. 

 

గత నెల 28నే భాస్కరరావు చంపేందుకు ప్రయత్నించారు కానీ ఆరోజు కుదరకపోవడంతో 29న చంపారు అని అన్నారు. హత్యకు చేయడానికి 5 రోజుల ముందు కొల్లు రవీంద్ర ఇంట్లో మర్డర్ ప్లాన్ జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఎక్కడా పేరు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అని ప్లాన్‌లో భాగంగానే నాంచారయ్య పారిపోతూ వేరే ఫోన్ నుంచి కొల్లు రవీంద్ర పీఏకు ఫోన్ చేశారని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: