ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల విషయంలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే ఏ విధంగా కూడా వెనకడుగు వేయడం లేదు. వారి విషయంలో ఏదోక సంక్షేమ కార్యక్రమం సిఎం జగన్ ప్రవేశ పెడుతూనే ఉన్నారు. ఇప్పటికే వారికి రైతు భరోసాను అందిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కాలంలో వారికి 10 వేల కోట్లను సిఎం జగన్ సర్కార్ అందించింది. 

 

ఇక ఇదిలా ఉంటే... తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకం కింద పేద రైతులకు... ఉచితంగా బోర్లు వెయ్యాలి అని నిర్ణయించారు. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు బోర్లు వెయ్యాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిఎం జగన్ ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: