అమరావతి ప్రాంత రైతుల భూములను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బలవంతంగా లాక్కున్నారు అని మంత్రి కన్నబాబు ఆరోపించారు. రాష్ట్రాభివృద్ది పై అందరికి సమాన హక్కు ఉంది అని ఆయన అన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్దిని చంద్రబాబు ఎందుకు అడ్డుకున్నారు అని ఆయన మండిపడ్డారు. 

 

రాష్ట్రాన్ని టీడీపీ కి రాసి ఇచ్చారా అంటూ ఆయన ఆరోపణలు చేసారు. చంద్రబాబు కావాలని ఉద్యమం చేయిస్తున్నారు అని మంత్రి అన్నారు. రాజధాని డిజైన్లకు చంద్రబాబు 800 కోట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారు అని ఆయన ఆరోపించారు. రాజధాని ఉద్యమం లేదు అని టీడీపీ ఉనట్టు చూపిస్తుంది అని కన్నబాబు ఆరోపించారు. కర్నూలు న్యాయ రాజధాని కాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: