ఇటీవలే దేశ ప్రధాని నరేంద్ర మోడీ సరిహద్దులో పర్యటించిన విషయం తెలిసిందే, అయితే తాజాగా మోదీ పర్యటన పై స్పందించిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మోదీ చైనా పేరు చెప్పేందుకు ఎందుకు వెనుకాడుతున్నారు అంటూ నిలదీశారు. మీరు సైనికులులను కలుసుకోవడం మంచి చేయడం మంచిదే.. వారిలో ధైర్యం పెరుగుతుంది.. కానీ మీ ప్రసంగంలో చైనా పేరు చెప్పడానికి ఎందుకు వెనుకాడుతున్నారు అని ప్రశ్నించారు. ఒకవేళ యుద్ధం జరిగితే మన దగ్గర నిల్వలు కేవలం 12 రోజులు మాత్రమే సరిపోతాయి అన్న విషయం చౌకీదార్ కి తెలుసా అంటూ నిలదీశారు.