ఎన్టీఆర్ కు భారత రత్న  ఇప్పించాలి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై భిన్నాభిప్రాయాలు ఆ పార్టీలోనే వ్యక్తమవుతూ ఉంటాయి. తాజాగా ఈ డిమాండ్ పై... వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్వీట్ లో తీవ్ర వ్యాఖ్యలు చేసారు. 

 

బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించానని కోతలు కోస్తున్న బాబు 14 ఏండ్లు సిఎంగా ఉండి ఎన్టీఆర్ కు అత్యున్నత పురస్కారం ఎందుకు ఇప్పించుకోలేక పోయాడు. రాష్ట్రపతులు, ప్రధానులను ఎంపిక చేయడం అబద్ధాలైనా అయి ఉండాలి. ఎన్టీఆర్ కు దక్కకుండా అడ్డుకోనైనా ఉండాలి. ఇందులో ఏది నిజం బాబూ అంటూ ఆయన తన ట్వీట్ లో ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: