ఏపిలో కరోనా విజిృంభణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 765 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే కరోనా కారణంగా 12 మంది మృతి చెందారు. ఏపిలో 727 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 32 మందికి… ఇతర దేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17699కి చేరుకుంది.
తాజాగా నంద్యాలలో కరోనాతో ఎస్బీఐ ఉద్యోగి మృతి. మృతుడు శిరువెళ్ల మండలం ఎర్రగుంట్లలో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఉద్యోగి మృతితో అతడి కాంటాక్ట్లపై అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఎస్బీఐ ఉద్యోగి కరోనాతో మృతి చెందడంతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ మద్య ప్రజా ప్రతినిధులు, అధికారులకు కరోనా కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే.