వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై, టీడీపీ నాయకులపై విమర్శలు చేశారు. కొన్ని రోజుల క్రితం వైసీపీ నేత మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించటంతో రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. ఎంపీ విజయసాయి ట్విట్టర్ వేదికగా మోకా హత్య గురించి బాబు, ఆయన పార్టీ నాయకుల గురించి విమర్శలు చేశారు. 
 
బాబు లాగే ఆయన క్రిమినల్ మాఫియా 1990 ల నాటి చిప్ లనే వాడుతున్నారని.... భాస్కర్ రావు హత్యకు స్కెచ్ వేసి కొల్లు రవీంద్ర కలెక్టరేట్ కు వెళ్లాడని...  ఫోన్లు, సిసి కెమెరాలు లేనప్పుడు ఈ ఎలిబీలు, సాక్షాలు పనికొచ్చేవేమో కాఅనీ... నేరం చేసినా, సుపారి ఇచ్చినా ఇప్పుడు తప్పించుకోలేరు అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: