మహారాష్ట్ర రోజురోజుకు కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ ను ఎంతగా నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. 

 

 ముఖ్యంగా ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీస్ అధికారులు సైతం ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్నారు. మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ లో భారీగా కేసుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 30 మంది పోలీసు సిబ్బంది కరోనా  వైరస్ బారిన పడ్డారు... కరోనా తో నలుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ కరోనా  వైరస్ బారిన పడిన మొత్తం పోలీసుల సంఖ్య 5205 కు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: