ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ అందరిని కలవరపెడుతున్న విషయం తెలిసిందే. దేశంలో రక్షణ కల్పిస్తున్న పోలీసులకు సరిహద్దుల్లో రక్షణ కల్పిస్తున్న జవాన్లను కూడా ఈ మహమ్మారి వైరస్ వదలడం లేదు.
ముఖ్యంగా బీఎస్ఎఫ్ జవాన్లు కరోనా కలవరపెడుతోంది. రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న బీఎస్ఎఫ్ జవాన్లు సంఖ్య పెరిగిపోతుంది. గడిచిన 24 గంటల్లో మరో 34 మంది బార్డర్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు కరోనా బారిన పడ్డట్లు తెలిపిన అధికారులు 33 మంది ఈ వైరస్ నుంచి కోరుకున్నట్లు తెలిపారు.
అయితే ఇప్పటివరకు పాజిటివ్ అని వచ్చిన చాలామంది జవాన్లకు ఎలాంటి లక్షణాలూ కనిపించలేదు అని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని బిఎస్ఎఫ్ ఉన్నత స్థాయి అధికారులు వెల్లడించారు.